www.theTelugus.com

హాస్పిటల్ నుంచి అంతిమ యాత్ర

చిన్నప్పుడు ఎప్పుడో  ఒక సామెత చదివాను: ‘నీ చేతి  మాత్ర, వైకుంఠ యాత్ర‘  అని.  వైద్యో  నారాయణో భవ   (దేముడు భగవంతునితో సమానం) అని కూడా అంటారు. ఈమధ్య ఒక మిత్రుడు  ఫోను లో ఒక   సందేశం  పంపాడు –        ఎంత చికాకు చేసినా  ఆస్పత్రిలో మాత్రం  అడ్మిట్ కావద్దు  అని.   “ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్  లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, పెషంటుగా  (IPగా) జాయిన్ కావద్దు” అని  సలహా ఇచ్చాడు. కారణం  చాలామంది  వైద్యులు  కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైకి  కనిలించినంత  అందమైనవి   కాదు. మేనేజ్ మెంట్ పెట్టె  టార్గెట్లు  పూర్తి కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్ కి .


డాక్టర్లు అంటే  దేవుళ్ళు అనే  అభిప్రాయం మనందరికీ ఉంటుంది. అతని ప్రకారం అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం. అతని దృష్టిలో  గాయకుడు  బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే  అని  చాలామంది నమ్ముతున్నారు.  ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. (అదేదో హోటల్ లాగా) .   అటునించి  అటే అనే తెలుసుకోలేక పోయాడు.  రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.  “దాసరి నారాయణ రావు, జయలలిత….ఇలా చాలా మంది చావుకు  రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి, టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీబయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు”  అని అతని అభిప్రాయం.

 
తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు, డబ్బు ఉన్నవారు. వైద్యము  పేరులో  చాలా  దగా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు. అసలు కారాణం ఎన్నో రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక ఉండడము. రోగం చిన్నదైనా  రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా  అని  ప్రశ్న. మన ఎస్పీ బాలు ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి.  ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి.  మరో అభిప్రాయం తీసుకోండి  కానీ ఊరక జొరబడ వద్దు.  పూర్వపు  ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది.  ఆ వైద్యులకి పరిస్థితి, మీ ఇతిహాసం తెలిసి ఉండేది.  కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్లకి  టార్గెట్లు  ఉంటాయి   అక్కడికి  పోడం   సరైనది  కాదు.  ఇంట్లో  ఉంటే వంద ఏళ్లు  బ్రతుకుతారు.  హాస్పిటల్ కు పోతే తిరిగి రారు. జాగ్రత్త.  కరోనా  యుద్ధ్హంలో  ప్రాణాలు  ఇచ్చిన  వైద్యులు  కమర్హియల్  హాస్పిటల్  లో  డబ్బుకోసం    నీతిని  విడుస్తున్నారా?          

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here